ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందిగామ ఘటనపై పురోగతి లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 04:27 PM

నందిగామ ఘటనపై ప్రముఖ  ఛానల్‌ తప్పుడు కథనాలు ప్రచురించిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు విమర్శించారు. గురువారం ఆయన నందిగామలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై ఆరు టీమ్‌లు ఏర్పాటు చేశామని, నిందితులను పట్టుకుంటామని పోలీస్ కమిషనరే చెప్పారని, ఇంతవరకు పురోగతి లేదని ఆరోపించారు. జడ్‌ ప్లస్‌ కేటగిరి ఉన్న చంద్రబాబు రోడ్‌షో సందర్భంగా కరెంట్ పోవడమేంటని ప్రశ్నించారు. బహిరంగ సభ జరిగే సమయంలో సంచులు పట్టుకుని కొందరు నిలబడ్డారని, ఆ ఫొటోను విడుదల చేశామన్నారు. చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ మధుకి గాయం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చూశారని దేవినేని ఉమ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa