ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అపుకోసం బీజేపీ ఎమ్మెల్యేని నిలదీసిన టీ కొట్టు యజమాని

national |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 11:37 PM

తనకు అపున్న మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిని అప్పుకోసం ఓ టీ కొట్టు యజమాని నిలదీశాడు.   టీ విక్రేత అడ్డగించి.. తనకు బకాయి పడిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సెహోర్ జిల్లా ఇచావ‌ర్ ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యే క‌ర‌ణ్‌సింగ్ వ‌ర్మ‌ కారులో వెళ్తుండగా... ఓ టీ విక్రేత అడ్డగించాడు. 2018 నుంచి బకాయి పడ్డ రూ.30,000లు వెంటనే చెల్లించాలని పట్టుబట్టాడు.


ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్కడి ఎమ్మెల్యేలు సొంత నియోజక వర్గాల్లో పర్యటిస్తున్నారు. తమ పార్టీ తరపున ప్రచారాలు చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే కరణ్ సింగ్ వర్మ కూడా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంలో ఓ టీ విక్రేత అతనిని అడ్డుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


దాంతో 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత క‌ర‌ణ్ సింగ్ వ‌ర్మ టీ విక్రేత‌కు బకాయి పడ్డ సొమ్ము ఇప్పటి వరకు ఇవ్వలేదన్న విషయం బయటకొచ్చింది. తాను ఈ మొత్తం బ‌కాయిప‌డిన మాట వాస్త‌వ‌మేన‌ని మాజీ మంత్రి కూడా ఒప్పుకున్నారు. ఇక సెహోర్ మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా కావడం గమనార్హం. మరోవైపు మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 11 నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో ప్రజలు కూడా ప్రజాప్రతినిధులకు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. తమకు ఏం కావాలో డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa