ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టిన బిడ్డతో గడిపేందుకు.... ఓ తండ్రి ఉద్యోగాన్నే మానేశాడు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 11:38 PM

పిల్లలు పుడితే వారి బాగు కోసం ఇంకా బాగా శ్రమించాలని భావించేవారుంటారు. కానీ అందుకు భిన్నంగా ఓ తండ్రి వ్యవహారించాడు.  ఏ వ్యక్తైనా ఫాదర్‌గా ప్రమోట్ అయితే... జీతం పెంచుకోవడానికి కొత్త ఉద్యోగాల్లో చేరుతుంటారు. లేదా ఉన్న సంస్థల్లో ప్రమోషన్‌ కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ఓ కొత్తగా తండ్రైనా వ్యక్తి మాత్రం దీనికి రివర్స్‌లో నిర్ణయం తీసుకున్నాడు. కూతురు పుట్టిన వెంటనే ఉద్యోగం మానేశాడు. నిజమేనా అనుకుంటున్నారా..? ముమ్మాటికి నిజం.


అంకిత్ జోషి అనే వ్యక్తి ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అనంతరం ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం పొందాడు. ఆరు అంకెల జీతంతో హాయిగా ఉన్నాడు. ఇంతలో అంకిత్‌‌కు తండ్రిగా ప్రమోషన్‌ వచ్చింది. ఓ చక్కటి పాపాయికి తండ్రి అయ్యాడు. అయితే తన ముద్దుల కూతురుతో గడిపేందుకు ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంకిత్ తన కూతురు స్పితిని ముద్దాడుతున్న ఫొటోను హ్యూమన్స్‌ ఆఫ్‌ బొంబే ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేయగా.. కొన్ని క్షణాల్లో 1.46 లక్షల లైకులు వచ్చాయి. దీంతో అంకిత్‌‌ను అందరూ అభినందనలతో ముంచెత్తారు.


నిజానికి అంకిత్‌ జోషి తాను పనిచేస్తున్న సంస్థకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇదే సమయంలో ఆయన భార్య ఆకాంక్ష తల్లైంది. ఓ పాపకు జన్మనిచ్చింది. అమ్మాయి పుట్టగానే తనతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో వెంటనే జాబ్ రిజైన్ చేశాడు. ఎందుకంటే ఆ ఉద్యోగ బాధ్యతల్లో తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దాంతో తన ఆరంకెల జీతం ఉద్యోగాన్ని వదిలేశాడు. ఈయన నిర్ణయానికి భార్య ఆకాంక్ష కూడా అంగీకరించింది. తండ్రిగా పొందిన ప్రమోషన్‌ను ఆనందించేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశానని హ్యూహన్స్ ఆఫ్ బాంబేకు అంకిత్ జోషి వెల్లడించాడు. తన జీవితం అంతా ఆమెకే కేటాయిస్తూ ఈ మధుర క్షణాలను ఆనందిస్తున్నానని అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa