ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక కేసు విచారణకు వెళ్లితే....భయపడి మరో కేసు నింధితుడు దొరికాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 11:40 PM

చట్టంనుంచి ఎవరైనా సరే తప్పించుకోలేరు అన్నది మరోసారి రుజువైంది.  పల్నాడు జిల్లాలో పోలీసులు పాత నేరస్తుడ్ని పట్టుకోవడానికి వెళితే మరో గుట్టు బయటపడింది. గురజాల మండలం చర్లగుడిపాడుకు చెందిన ఉద్దగిరి అలేఖపై పాత కేసుల దర్యాప్తునకు పోలీసులు, వీఆర్వో, వీఆర్‌ఏ కలిసి వాహనంలో ఆ ఊరికి వెళ్లారు. వారిని గమనించి అతడు పారిపోయే ప్రయత్నం చేశాడు. అనుమానంతో అతడి ఇంట్లో చూస్తే.. నకిలీ కరెన్సీ ముద్రించేందుకు ఉపయోగించే పరికరాలు, ఇతర వస్తువులు, ముద్రించిన కరెన్సీ కట్టలు కనిపించాయి.


ఆ ఇంట్లోనే రూ.200 నోట్ల కట్టలు (29), రూ.500 నోట్ల కట్టలు (9), రూ.100 నోట్ల కట్టలు (4) మొత్తం కలిపి రూ.10.70 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఓ కంప్యూటర్‌, ప్రింటర్‌, కీబోర్డ్‌, ఏ4 పేపర్‌లు, కట్టర్‌, స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడిన నిందితుడు నర్సరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు పోలీసులు. పోలీసులు పాత కేసుల వ్యవహారంలో వెళితే ఈ ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ గుట్టురట్టైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa