ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 11:50 PM

అలా పదవి వచ్చిన సంతోషంలోవున్న ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై రాజమండ్రిలో కేసు నమోదైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోసానిపై గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


అయితే, పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి రెండో జేఎఫ్‌సీఎం కోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరిగింది. చివరికి, పోసానిపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై పోలీసులు ఐపీసీ 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలావుంటే పోసాని కృష్ణ మురళికి ఇటీవలే ప్రభుత్వ పదవి కట్టబెడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా పోసాని కృష్ణ మురళిని నియమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa