ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడున్నరేళ్ల తరువాత అధినేతను కలిసిన కేఈ కృష్ణమూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 11:49 PM

దాదాపు మూడున్నరేళ్ల తరువాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఆ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి కలిశారు. 2019 ఎన్నికల తర్వాత కేఈ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కుమారుడ్ని యాక్టివ్ చేసిన తర్వాత ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అప్పుడప్పుడు నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలకు మాత్రం వెళుతున్నట్లు స్థానికంగా టాక్. అయితే దాదాపు మూడన్నరేళ్ల తర్వాత కేఈ అధినేత చంద్రబాబును కలిశారు. జిల్లా పర్యటన కోసం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సమయంలో మర్యాదపూర్వకంగా కలవగా.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కేఈ కృష్ణమూర్తి వెంట సోదరుడు ప్రభాకర్ కూడా ఉన్నారు. చాలా రోజుల తర్వాత కేఈ కనిపించారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.


కేఈ కుటుంబం ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి బలం. కృష్ణమూర్తితో సోదరులు ప్రభాకర్, ప్రతాప్‌లు పార్టీలో ఉన్నారు. కేఈ ఫ్యామిలీ 2019 తర్వాత సైలెంట్ కావడంతో కొన్ని సందర్భాల్లో టీడీపీని వీడతారనే ప్రచారం జరిగింది.. కానీ ఆ కుటుంబం మాత్రం పార్టీలోనే కొనసాగుతోంది. ఈ కుటుంబం డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో వరుసగా పోటీ చేస్తూ వస్తోంది.


2014 ఎన్నికల వరకూ ప్రత్తికొండ నుంచి కేఈ కృష్ణమూర్తి పోటీ చేశారు. అక్కడ టీడీపీ మొత్తం ఏడుసార్లు గెలిచింది. ఇటు డోన్ లోనూ టీడీపీ సత్తా చాటింది. అక్కడ కూడా కేఈ కుటుంబం నుంచి కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ ఆరుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత పరిణామాలతో డోన్ నియోజకవర్గం కేఈ కుటుంబం దూరమైంది.. అక్కడ కొత్త ఇంఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో డోన్ నుంచి తానే పోటీ చేస్తాను అంటున్నారు. గతంలో కేఈ ప్రభాకర్‌కు డోన్ టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. కానీ సుబ్బారెడ్డి మాత్రం తానే ఎన్నికల బరిలో ఉంటాననడం ఆసక్తికరంగా మారింది.


కేఈ ప్రభాకర్ డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004లో కోట్ల సుజాతమ్మ చేతిలో ఓడిపోయారు. 2009లో ప్రభాకర్ సోదరుడు కృష్ణమూర్తి డోన్‌లో పోటీ చేయడంతో.. ఆయన పత్తికొండ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014లో మరో సోదరుడు ప్రతాప్ డోన్ నుంచి పోటీచేసి ఓడిపోగా.. 2019లో ప్రభాకర్‌ను డోన్ నుంచి మళ్లీ బరిలోకి దిగగా ఓడారు. అనంతరం కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీకి, టీడీపీ రాజీనామా చేయడంతో.. తర్వాత ఎమ్మెల్సీగా ప్రభాకర్‌కు అవకాశం కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa