‘వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అబద్ధాలనే ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక కూడా మోసాలతోనే కాలం గడిపిస్తోంది’. అని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీష విమర్శిం చారు. అధికారపార్టీ ఆగడాలపై ఇంటింటికి వెళ్లి నిజాల్ని చెబుదామని శ్రేణుల కు పిలుపునిచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పేరిట నిర్వహించే కార్యక్రమంపై పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆమె కార్యకర్తలతో మాట్లాడారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దుచేస్తామని జగన్ ఇచ్చిన హామీ నుంచి ప్రత్యేక హోదా, జాబ్ క్యాలెండర్, పాఠశాలల విలీనం పేరిట మోసం.. ఇలా అన్నింటిపై ప్రజలకు నిజాన్ని తెలియజేయాలని సూచిం చారు. ప్రజల ఓట్లు టీడీపీకి మరలేంతవరకూ నిజాల్నే ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాతపట్నం మాజీఎమ్మెల్యే కలమట వెంకటరమణ, నాయకులు పీరుకట్ల విఠల్రావు, మొదలవలస చిరంజీవి, పీఎంజే బాబు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa