ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురజాడ పురస్కారం చాగంటికిి ఎలా ఇస్తారు,,,కవులు, కళాకారులు, హేతువాదుల ప్రశ్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 01:15 PM

గురజాడ పురస్కారం చాగంటికిి కోటేశ్వరరావు ఎలా ఇస్తారు అంటూ కవులు, కళాకారులు, హేతువాదుల ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వివాదంలో చిక్కుకున్నట్లయింది. ఆయనకు ప్రకటించిన గురజాడ పురస్కారంపై వివాదం చెలరేగుతోంది. చాగంటికి గురజాడ పురస్కారం ఇవ్వనుండటంపై కవులు, కళాకారులు, హేతువాదులు మండిపడుతున్నారు. ఆధ్యాత్మికవేత్తగా ఉన్న చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ అప్పారావు పురస్కారాన్ని ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. గురజాడ అప్పారావు జీవితాంతం హేతువాదిగా, అభ్యుదయవాదిగా ఉన్నారని, అలాంటప్పుడు దేవుడి గురించి ప్రవచనాలు బోధించే చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు.


గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారాన్ని చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడంలో అసలు అర్థం లేదని హేతువాదులు, కవులు, కళాకారులు మండిపడుతున్నారు. ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిరసనలకు కూడా పలు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ రోజు విజయనగరం జిల్లాలోని గురజాడ అప్పారావు ఇంటి నుంచి ర్యాలీ చేయాలని నిర్ణయించాయి. అంతేకాకుండా పురస్కారం ప్రదానం చేసే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునేందుకు సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారుల సంఘాలు సిద్దమవుతోన్నాయి.


గురజాడకు నివాళిగా గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు ప్రతి సంవత్సరం గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి ప్రతీ ఏడాది కూడా ఇస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వాలని సభ్యులు నిర్ణయించారు. నవంబర్ 30న గురజాడ వర్దంతి సందర్భంగా విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించే గురజాడ సాంస్కృతిక సమాఖ్య కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు.


అయితే గురజాడ విశిష్ట పురస్కారాన్ని చాగంటి కోటేశ్వరరావుకు ఇస్తే ఒప్పుకునేది లేదని, అడ్డుకుని తీరుతామని కవులు, రచయితల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. గురజాడ భావాజలానికి వ్యతిరేకమైన భావాలు కలిగిన చాగంటికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. ఈ ఆందోళనల కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు పురస్కారాన్ని అందుకుంటారా.. ? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని డైరెక్టర్ కె.విశ్వనాథ్, రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గరికపాటి నరసింహరావు, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్ క్రిష్, రామజోగయ్యశాస్త్రి, అంజలిదేవి, తనికెళ్ల భరణి, సుద్దాల, సి.నారాయణరెడ్డి, గుమ్మడి, షావుకారు జానకి, మల్లెమాల, రావి కొండలరావు, వంశీ, చాట్ల, మొదిటి నాగభూషణ శర్మ లాంటి ప్రముఖులు అందుకున్నారు. కానీ ఇప్పటివరకు ఎప్పుడూ ఈ పురస్కారంపై వివాదం తలెత్తలేదు. తొలిసారి చాగంటి కోటేశ్వరరావు విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదం నేపథ్యంలో 30వ తేదీన ఏం జరుగుతుందనేది ఉత్కంఠకరంగా మారింది. మరి చూడాలి దీనిపై ఏం జరుగుతుందో..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa