డిసెంబరు 3, 4 తేదీలలో సిఐటియు శ్రీకాకుళం జిల్లా 11వ మహసభలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరావు, జిల్లా నాయకులు అల్లు. సత్యన్నారాయణ, ఎమ్. ఆదినారాయణమూర్తి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో డైమండ్ పార్క్ వద్ద సిఐటియు జిల్లా మహసభలు లోగో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు జిల్లా మహసభలు సందర్భంగా డిసెంబరు 3న శ్రీకాకుళం ఏడు రోడ్లు కూడలి నుండి ర్యాలీ అనంతరం డైమండ్ పార్క్ వద్ద బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ ర్యాలీ, బహిరంగ సభలో అధిక సంఖ్యలో కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ మహసభలకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సి. హెచ్. నర్సింగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. ఎ. గఫూర్ హాజరవుతారని తెలిపారు. కార్మిక సమస్యలుపై సమరశీలంగా పోరాడుతున్న సంఘం సిఐటియు అని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికుల శ్రమను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తుందని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa