మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పై పోలీసులు పేకాట కేసు నమోదు చేశారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పేకాట ఆడుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీంతో ఆయనపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే స్థాయి నేత, అది కూడా అధికార పార్టీకి చెందిన నేతపై పోలీసులు పేకాట కేసు నమోదు చేయడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బారావు... ప్రస్తుతం వైసీపీ నేతగా కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వరుపుల సుబ్బారావు.. 1983 నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నారు. తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన వరుపుల మరోమారు ముద్రగడ చేతిలోనే ఓడిపోయారు.
తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన ఆయన వరుసగా మూడో పర్యాయం కూడా ఓడిపోయారు. ఆ తర్వాత మరోమారు టీడీపీలో చేరిన ఆయన తొలి సారిగా 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వరుపుల మరోమారు ఓడి... 2014 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో టికెట్ రాకపోవడంతో ఆయన వైసీపీలో చేరి... ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa