రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి కుటుంబానికి రూ.65.62 లక్షల పరిహారం చెల్లించాలని థానె జిల్లా మోటారు ప్రమాదాల క్లెయిమ్ ట్రిబ్యునల్ బీమా సంస్థ ఎన్ఐసీఎల్ ను, ప్రమాదానికి కారణమైన మరో వాహనదారుడిని ఆదేశించింది. సందేశ్ సిండే అనే వ్యక్తి 2020 మార్చి 18న తన స్నేహితుడితో కలిసి వెళ్తుండగా ఓ ట్రాలర్ వచ్చి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో షిండే మరణించగా.. అతని కుటుంబం రోడ్డున పడింది. ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రమాదానికి కారణమైన ట్రాలర్ యజమాని పరిహారం ఇవ్వకుండా సాకులు చెప్పారు. దీంతో ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా పరిహారం చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa