అచ్చుతాపురం మండలం కార్మిక హక్కుల పరిరక్షణకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న సిఐటియు 12వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం ఎస్సీ జెడ్ లోని కార్మికుల సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, ఫార్మా, ఎస్. ఈ. జెడ్ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు అసంఘటిత రంగ కార్మికులు, స్కీం వర్కర్లు లక్షలాది మంది జిల్లాలో ఉన్నారని, కార్మికులకు కనీస హక్కులు అమలు కావడం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన కనీస వేతనాలు అమలు కాక పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో కార్మికుల ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమలు వచ్చిన స్థానికులకు ఉపాధి కల్పించడం లేదని తరచూ పరిశ్రమల ప్రమాదాలతో కార్మికులు మరణిస్తున్నారని, వేలాది మంది ఉన్న స్కిం వర్కర్లు రాజకీయ వేధింపులకు గురవుతున్నారని, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఏ చట్టాలు అమలు కావడం లేదని కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిఐటియు అనకాపల్లి జిల్లా 12వ మహాసభలు డిసెంబర్ 18 , 19 తేదీల్లో పరవాడలో జరుగుతున్నాయని, ఈ మహాసభల్లో జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొని కార్మికుల సమస్యలపై చర్చించనున్నారని,ఈ మహాసభల సందర్భంగా డిసెంబర్ 18న పరవాడలో భారీ బహిరంగ సభ , ప్రదర్శన నిర్వహించనున్నామని, కావున కార్మికులు ఉద్యోగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐడి జిల్లా కార్యదర్శి రొంగలి రాము, కొండ్రపు సోమ నాయుడు, రాజు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa