ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమగ్ర సర్వేతో భూవివాదాలు పరిష్కారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 04:38 PM

వైఎస్ఆర్ జగనన్న శాశ్విత భూహక్కు- భూరక్షపథకం రైతుల భూములకు రక్షణగా నిలుస్తుందని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రమైన సంబేపల్లె లో నిర్వహించిన భూముల రీసర్వే పూర్తిచేసుకున్న సంబేపల్లె, రౌతుకుంట గ్రామాల రైతులకు భూ హక్కు పత్రాలును జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, ఎంపిపి ఆవుల నాగశ్రీ లక్ష్మీ, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచుల సంఘ జిల్లా అధ్యక్షుడు చిదంబర్ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి గొర్ల ఉపేంద్రా రెడ్డి, వివి ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ అంచల రామచంద్ర, ఎంపిటిసి భద్రయ్య తదితరులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేనివిధంగా అత్యాధునిక సర్వే సాంకేతికతలుతో సమగ్ర సర్వేని సీఎం జగన్ ప్రారంభించారన్నారు. సమగ్ర సర్వేతో భూవివాదాలు పరిష్కరమవు తున్నాయన్నారు. బ్రిటిష్ కాలంలో వంద సంవత్సరాల క్రితం జరిగిన సర్వేతో భూ సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. రెవెన్యూ అంశాలలో ఎటువంటి రాజకీయ ప్రమేయాలు, ఒత్తిళ్లు వుండకూడదన్నారు. రాబోవు రోజులలో గ్రామ కంఠాలను కూడా సర్వే చేయించడం జరుగుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa