ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తాం: డీఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 12:48 PM

పులివెందుల ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు స్పష్టంచేశారు. పులివెందుల పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మట్కా గురించి తమపై నిరాధారమైన ప్రకటను చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు మట్కా స్థావరాలపై దాడులు నిర్వహించి 30 కేసులు నమోదు చేశామన్నారు. సుమారు 84 మంది మట్కా బీటర్లను అరెస్టు చేసి వారి నుంచి రూ. 3, 51, 230లు నగదును సీజ్ చేశామన్నారు. అలాగే పేకాట స్థావరాలపై కూడా దాడులు నిర్వహించి ఇప్పటి వరకు 42 కేసులు నమోదుచేసి 254 మంది పేకాల రాయుళ్లను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి రూ. 15. 37లక్షల నగదును సీజ్చేశామన్నారు. ఒక వైపు సర్వ సాధారణ, శాంతిభద్రత, పలురకాల విధులను నిర్వహిస్తూనే మరోవైపు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపినట్లు ఎస్ పి శ్రీనివాసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చిరంజీవి, హెడ్ కానిస్టేబుల్ రామ్ గోవింద్, కానిస్టేబుల్ మహేష తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa