ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క నయాపైసా అవినీతికి పాల్పడ్డానని నిరూపించగలరా: ధర్మాన ప్రసాదరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 09:33 PM

తాను ఒక్క నయాపైసా అవినీతికి పాల్పడ్డానని నిరూపించగలరా అని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు  సవాల్ విసిరారు. తనకు అవినీతి అంటేనే నచ్చదని ఆయన పేర్కొన్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబుకు కోట్లాది రూపాయల ఆస్తి ఎలా వచ్చిందని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబుపై ఏవైనా కేసులు వేస్తే, కోర్టు నుంచి స్టేలు తీసుకొస్తారని విమర్శించారు. 


తనను గెలిపించిన ప్రజలు తలదించుకునే పని తానెప్పుడూ చేయనని అన్నారు. ఉద్యోగులు కూడా అవినీతికి దూరంగా ఉండాలని చెప్పారు. పార్టీలోని నేతలందరూ ఆర్థికంగా చితికిపోయారని, అయినప్పటికీ ఎక్కడా అవినీతికి పాల్పడటం లేదని అన్నారు. అవినీతి లేని సమాజం రావాలని, ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. 


మార్పు తీసుకురావాలనే జగన్ వంటి నేతలు కఠినంగా ఉంటారని... అలాంటి వ్యక్తిని నానా మాటలు అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa