ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివ్యాంగుడికి ప్రభుత్వం ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనం మంజూరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 01:20 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన ఖలీల్‌ అనే దివ్యాంగుడికి సీఎం వైయ‌స్‌ జగన్‌ ఇచ్చిన హామీ నెరవేరింది. ఈ ఏడాది జూలైలో వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా చింతూరు వచ్చిన ముఖ్యమంత్రిని ఖలీల్‌ కలిసి తనకు మూడు చక్రాల ఎలక్ట్రిక్‌ వాహనం మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రమిచ్చాడు. దీంతో అతనికి  ఎలక్ట్రిక్‌ వాహనం మంజూరు చేస్తూ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. సబ్‌ కలెక్టర్, ఐటీడీఏ పీవో ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద ఏవో రాజ్‌కుమార్‌ ఆ వాహనాన్ని ఖలీల్‌కు అందజేశారు. తనకు ఎలక్ట్రిక్‌ వాహనం మంజూరయ్యేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రికి ఖలీల్‌ కృతజ్ఞతలు తెలిపాడు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa