ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టడం ఖాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 02:25 PM

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలపై భారం మోపారని టీడీపీ నాయకుడు, తెలుగు యువత కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఎరిగేరి, బాపురం, డమ్ములదిన్నె, అగసలదిన్నె గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్య లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాలకుర్తి దివాకర్‌ రెడ్డి మాట్లాడుతూ....  ఎన్నికల సమయంలో జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి అధికారం చేపట్టి మూడున్నరేళ్లు కావస్తున్నా హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెన్నబసప్ప, వెంకటపతి రాజు, అడివప్పగౌడు, శివమోహన్‌ రెడ్డి, వెంకటరెడ్డి, రమేష్‌గౌడు, రాజానంద్‌, బసవరాజు, హుశేనీ, మంజునాథ్‌, వీరేష్‌, డేవిడ్‌, ఈరన్న పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa