ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిధులు, విధులు లేని కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి కాపులను మోసం చేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 02:26 PM

కాపులకు రిజర్వేషన్లు అమలు చేసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై వైసీపీ కాపు నాయకులు ఒత్తిడి తేవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రకుమార్‌ (నాగ బాబు) సూచించారు. గురువారం టీడీపీ కృష్ణా  జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తూతూ మంత్రంగా ఇచ్చిన కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవీ కాలం ముగిసిందన్నారు. నిధులు, విధులు లేని కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి కాపులను అవమానించిన జగన్‌రెడ్డిని వైసీపీ కాపు నాయకులు పొగడడం ఇప్పటికైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. టీడీపీ హయాంలో చంద్రబాబు అమలు చేసిన కాపు రిజర్వేషన్లను జగన్‌రెడ్డి రద్దు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .కాపుల పట్ల జగన్‌రెడ్డికి ఎంత ద్వేషం ఉందో అర్థమవుతోందన్నారు. కాపులకు మేలు జరగాలంటే చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీలో ఉన్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు టీడీపీ హయాంలో కల్పించిన హక్కుల కోసం పోరాడాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa