వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని రం గాలు అస్తవ్యస్తం అయ్యాయని టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు. టీడీపీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలోని 28వ వార్డులో గురువారం ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని సీతారామలక్ష్ద్మి మాట్లాడుతూ నిత్యం పెరుగుతున్న అధిక ధరలను అరికట్టలేని సైకో ముఖ్యమంత్రి పోయి తిరిగి చంద్రబాబు రావాలన్నారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరావు మాట్లాడుతూ... అసమర్ధ ముఖ్యమంత్రి పాలనపై ప్రజలు విసుగు చెందారని, అభివృద్దికి పాటుబడే చంద్రబాబు రాక కోసం ఎదురు చుస్తున్నారన్నారు. మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ.... యనమదుర్రు కాలువగట్టుపై స్థానికులు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారన్నారు. మైలా బత్తుల ఐజాక్ బాబు, గునుపూడి తిరుపాల్, గంటా త్రిముర్తులు, మాంతి గణపతి మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమాబేగం, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa