వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్నివర్గాల ప్రజల జీవనం దుర్భరంగా మారిందని, ఆ పాలనకు చరమ గీతం పాడాలని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొన్నారు. నల్లమాడ మండలం లోని పులగంపల్లిలో గురువారం ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ గ్రామాన పల్లెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వైసీపీ పాలనలో ప్రతి వస్తువు ధరలు పెంచుతున్నారే తప్ప, ప్రజలకు న్యాయం చేసింది ఏమీలేదన్నారు. పెట్రోల్ ధరలు ఏరాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. మహి ళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం వైసీపీ అన్నారు. దిశ చట్టం తీసుకొ చ్చామని చెబుతున్నారేకానీ, అది చట్టమే కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంటు బిల్లులు ఏడుమార్లు పెంచార న్నారు. ఇంటింటా తిరిగి ఇదేం ఖర్మ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటికెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని, వైసీపీ అవినీతి పాలను వి వరించారు. ఈకార్యక్రమంలో సర్పంచ ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్మైలే శివశంకర్, మాజీ కన్వీనర్ కేశరెడ్డి, రాజారెడ్డి, గంగులప్పనాయుడు, సలాంఖాన, గనరెడ్డి, అశోక్ఖాన, రమేష్, పద్మానాభరెడ్డి, నరసింహారెడ్డి, గంగప్ప, మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa