ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతన్న రాజ్య స్థాపనే జనసేన లక్ష్యం: పెండ్యాల శ్రీలత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 06:50 PM

రైతుల అభివృద్ధి, సంక్షేమమే జనసేనపార్టీ లక్ష్యమని జనసేనపార్టీ మహిళా విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత శుక్రవారం పేర్కొన్నారు. నార్పల మండల పరిధిలోని గంగనపల్లి గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అంతర్జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. రైతులతో కలిసి పంట పొలాలను సందర్శించి వ్యవసాయం గురించి రైతులతో చర్చించారు. ఈ సందర్బంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్షంలోని ఉన్నప్పుడు రైతుల కోసం అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక రైతుల విస్మరించారన్నారు. రాష్ట్రంలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా రైతులకు ఒక్క డ్రిప్ పైపు కూడా అందివ్వలేదని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa