ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 07:25 PM

ఉరవకొండలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు జైకిసాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జైకిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నాగమల్లి ఓబులేసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉరవకొండ రూరల్, అర్బన్ సీఐలు శేఖర్, హరినాథ్ ప్రారంభించారు. పలువురు రైతులు పాల్గొన్నారు. అనంతరం కల్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలను జైకిసాన్ ఫౌండేషన్ తరపున చేయూతని అందించారు. వారికి ఆర్థిక సాయం అందించి సన్మానించారు. అదే విధంగా వ్యవసాయంలో విజయాలు సాధించిన రైతులను సన్మానించారు. ఉత్తమ రిపోర్టర్లను సన్మానించారు. వీటితో పాటు కిమ్స్, సవేర అద్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాతలకు మద్దతుగా కళాకారుల పడిన పాటలు, చేసిన నృత్యాలు పలువురుని ఆకట్టుకున్నాయి. ఈసందర్భగా జైకిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఓబులేసు మాట్లాడుతూ జాతీయ రైతు దినోత్సవాన్ని 2001లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ దాన్ని నిర్వహించడంలో నిర్లక్ష్యంగా ఉందన్నారు. రైతు దినోత్సవం ఘనంగా జరిపిన నాడే మన రైతులను గౌరవించినట్టు అవుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa