ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త పై ఇంత పెద్ద దాడా....?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 07:56 PM

దంపతుల మధ్య అనుమానం పెనుభూతంగా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య తన భర్త మర్మాంగాన్ని గోళ్ళతో రక్కేసింది.శ్రీకాళహస్తి మండలం పెనుబాక దళితవాడకు చెందిన ఆటో డ్రైవరు మహేంద్ర భార్య సంధ్య. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ మధ్య తన భర్తకు పరస్త్రీతో సంబంధం ఉందేమోనన్న అనుమానం సంధ్యలో మొదలైంది.ఈ అనుమానం పెద్దదై ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో శనివారం ఇంటి వద్ద ఫోన్‌ మరిచిపోయిన మహేంద్ర ఆటో నడిపేందుకు శ్రీకాళహస్తికి వచ్చాడు. తిరిగి రాత్రి ఇంటికి చేరుకుని ఫోన్‌ను చూడగా అది పనిచేయలేదు. ఫోన్‌ ఏం చేశావంటూ భార్యను ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వు తప్పు చేస్తున్నావంటే.. కాదు నువ్వే తప్పు చేస్తున్నావంటూ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. తోపులాటలో భర్త కింద పడిపోవడంతో సంధ్య అతడి మర్మాంగాన్ని గోళ్లతో రక్కేసింది. దీంతో గాయపడిన మహేంద్రను స్థానికులు చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa