ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవన నిర్మాణాలను వేగవంతం చెయ్యండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 07:57 PM

ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని చిత్తూరు కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు. శనివారం ఆయన పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న భవన నిర్మాణాల పురోగతిపై ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. మండలాలవారీగా 15 రోజులకొకసారి నిర్మాణాల పురోగతిని తెలియజే యాలని, తద్వారా భవనాల పురోగతి వేగవంతం అవుతుందని అన్నారు. సచివాలయ భవనాలకు సంబంధించి 524 పనులు మంజూరు కాగా, ఇప్పటివరకు 316 పూర్తయ్యాయని, 110 తుది దశకు చేరుకున్నాయని అన్నారు. ఆర్బీకేలకు సంబంధించి 506 పనులు మంజూరు కాగా, 281 పూర్తయ్యాయని, 93 తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. వైఎస్సార్‌ హెల్త్‌క్లీనిక్‌లకు సంబంధించి 351 పనులు మంజూరు కాగా 106 పూర్తయ్యాయని, 96 తుది దశకు చేరుకున్నాయని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa