ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 06:00 PM

కాజీపేట మండలంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పక్కిరిపల్లె నాగరాజు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు దేశం పార్టీ నిర్వహించిన బహిరంగ సభ తొక్కిసలాటలో జరిగిన దుర్ఘటన లో 8 మంది తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరణించడం జరిగిందని, ఈ దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యం కల్పించాలని, అదేవిధంగా పార్టీ తరపున వారికి ఆర్థిక సహాయం ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం అని ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa