రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం అని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పుల్లంపేట మండలం ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో సీనియర్ నాయకులు కొల్లం గంగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పథకాల అమలులో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక వ్యవస్థ వుండాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో కలిసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పులి. సునీల్ కుమార్, మండల కన్వీనర్ ముస్టాక్, జెడ్పీటీసీ సభ్యులు రామనాథం పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa