ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు సభలకు తరలిస్తున్నారని మంత్రి విడదల రజిని విమర్శించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. గాయపడిన మరికొందరికి పరిహారం రాలేదన్నారు. వారికి కూడా పరిహారం అందేలా చర్యలు చేపట్టాం. చంద్రబాబు సభలకు ప్రజలు రావటం లేదు. ప్రజలను మభ్యపెట్టి సభలకు తరలిస్తున్నారు. సభలకు జనం పెద్ద ఎత్తున వచ్చారని ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమం కాదు ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం అని చంద్రబాబు ప్రకటించారు. కానీ ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు ఎవరూ చంద్రబాబుకు మద్దతుగా లేరు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఇప్పటి వరకూ 40 మందిని బలి తీసుకుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని కోరుతున్నాం.’’ అని మంత్రి విడదల రజిని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa