మా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాత మాత్రమే బీఆర్ ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రాలో అడుగుపెట్టాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. లాసన్స్ బే కాలనీ లో గల బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీ ఆర్ ఎస్ లో పలువురు చేరారని అంటున్నారు. మా ప్రశ్నలు సమాధానం చెప్పాకే ఆంధ్రాలో అడుగు పెట్టాలి. ఆంధ్రా వాళ్ళను కుక్కలు తరిమి తరిమి కొట్టండి అన్నావు. ఆంధ్రా పాలకులు, పార్టీలు అవసరమా అన్నావు. ఆంధ్రకు నీరు ఆపవు. కృష్ణ ట్రిబ్యునల్ అడ్డుకున్నవు. ఏమి ముఖం పెట్టుకుని ఇక్కడకు వస్తావని జీవీఎల్ ప్రశ్నించారు. తెలంగాణ లో దుర్మార్గపు పాలన చేస్తున్నారని,. విభజన బిల్లు సమస్యలు పరిష్కారం కాలేదు. ఆంధ్రకు రాజధాని లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ఆంధ్రా వాళ్ళను అడ్డుకున్నారు అని గుర్తు చేశారు.
ఆంధ్ర పాలకులు చంద్ర బాబు ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నందునే వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి రాజకీయాలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు పడవు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని జీవీఎల్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కెసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన కెసిఆర్ వీడియోలు వినిపించారు. మాకు తెలంగాణ పార్టీలు అవసరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, జగన్ లకు కెసిఆర్ ని విమర్శ చేయాలంటే భయపడుతున్నారన్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన మీరు పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆంధ్ర రోడ్లు పై రాలీ లు, సభలు నిషేధించడం కొంత కాలం అయినా అమలు చేయాలని కోరారు. ప్రతి పక్షాలను అడ్డు కోవడానికి ఈ నిబంధన ఉపయోగిస్తే ప్రజలే అడ్డుకుంటారు. పార్టీలు స్వీయ నియంత్రణ కూడా చేయాలన్నారన్నారు. ఆంధ్రా లో కుల రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. మీడియా సమావేశం లో బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ఎం రవీంద్ర , ఉపాధ్యక్షుడు దిలీప్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa