ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీపక్ హుడా 41, ఇషాన్ కిషన్ 37, అక్షర్ పటేల్ 31 పరుగులు చేశారు. ఆ తర్వాత శ్రీలంక 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో శివమ్ మావి 4 వికెట్లతో సత్తా చాటాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa