ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు సభలకు వచ్చే జనాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 07:01 PM

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న పిచ్చి తుగ్లక్‌ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని అంతమొందిద్దామని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని కందుకూర్లపల్లిలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవ్వ, తాతల 6 లక్షల పింఛన్లు పీకేసీ, 2 లక్షల మందికి కొత్తగా ఇచ్చి గొప్పలు చె ప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు రూ.3 వేలు పింఛన ఇస్తానని, మూడున్నరేళ్లయినా విడతలవారీగా ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సభలకు వచ్చే జనాన్ని చూసి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఓర్వలేకనే జీఓ-1ను తీసుకొచ్చారని ఆరోపిం చారు. వైసీపీ ప్రభుత్వానికి కాలం దగ్గరపడిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. గ్రామాల్లో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులే కనబడుతున్నాయన్నారు. వైసీపీ పాలనలో అభివృ ద్ధి పక్కదారి పట్టిందని, రూ.9 లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల రాష్ట్రంగా తీ ర్చిదిద్దాడని విమర్శించారు. ఇసుక, సిమెంటు ధరలు పెంచుతూ ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ రా ష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి రొద్దం న రసింహులు, పెనుకొండ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు చిన్నప్పయ్య, మా ధవనాయుడు, చంద్రమౌళి, కన్వీనర్‌ నరహరి, క్లస్టర్‌ ఇనచార్జి నాగేంద్ర, మాజీ సర్పంచ అశ్వర్థనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి మురళి, పార్లమెంట్‌ తెలుగు యువత ఉపాధ్యక్షుడు హరీష్‌, లీలావతి, తులసి, తిరుపాల్‌నాయుడు, కిష్టప్ప పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa