ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితా వచ్చేసింది

national |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 07:28 PM

తెలుగు రాష్ట్రాల ఓట్ల జాబితా వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలను విడుదల చేసింది. ఇటీవల ఓటర్ల సవరణ పూర్తయిన నేపథ్యంలో, తెలంగాణ, ఏపీలకు సంబంధించి నూతన జాబితాలు రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరువ కాగా, ఏపీలో 4 కోట్లకు దగ్గరైంది. ప్రతి సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘం సవరణల అనంతరం జనవరిలో ఓటర్ల తుది జాబితాలను ప్రకటించడం ఆనవాయతీ.


తాజాగా ప్రకటించిన జాబితాల ప్రకారం...


తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య- 2,99,92,941


పురుష ఓటర్ల సంఖ్య- 1,50,48,250


మహిళా ఓటర్ల సంఖ్య- 1,49,24,718


థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య- 1,951


సర్వీసు ఓటర్ల సంఖ్య- 15,282


హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య- 42,15,456


రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య- 31,08,068


మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య- 25,24,951


అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి (6,44,072)


అతి తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం భద్రాచలం (1,42,813)


ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య- 3,99,84,868


ఏపీలో మహిళా ఓటర్ల సంఖ్య- 2,02,19,104


ఏపీలో పురుష ఓటర్ల సంఖ్య- 2,01,32,271


ఏపీలో సర్వీసు ఓటర్ల సంఖ్య- 68,162


థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య- 3,924


అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లా కర్నూలు (19,42,233)


అతి తక్కువగా ఓటర్లు కలిగి వున్న జిల్లా (7,29,085)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa