ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్యానా, పంజాబ్ గవర్నర్లకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 07:29 PM

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి గురువారం చండీగఢ్ వెళ్ళారు. అక్కడ హర్యానా, పంజాబ్ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, బన్వరిలాల్ పురోహిత్ లను కలిశారు. ఆయా రాష్ట్రాల రాజ్ భవన్ లను సందర్శించి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాల ఆహ్వాన పత్రికను, రాజశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని అందజేసారు. జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయని స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రాజశ్యామలా యాగంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు పొందాలని గవర్నర్లను కోరారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర వద్ద గుంతి ధామ్ లో ఫిబ్రవరి 11 నుండి 26వ తేదీ వరకు భారీ ఎత్తున లక్ష చండీ యాగం తలపెడుతున్నట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa