ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 31నుంచి ఏఐయూ వీసీల సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 07:30 PM

అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సౌత్ జోన్ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆతిధ్యం ఇవ్వనుంది. జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీలలో ఏయూ వేదికగా ఈ సమావేశాలు జరగనున్నాయి. గురువారం ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో వైస్‌ చాన్సలర్ల సమావేశం నిర్వహణపై ఏర్పాటు చేసిన వివిధ కమిటీలతో వీసీ ఆచార్య పి. వి. జి. డి ప్రసాద రెడ్డి సమావేశమయ్యారు. జనవరి 31న ఉదయం బీచ్ రోడ్డులోని పియూ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఏయూ కామర్స్ మేనేజ్ మెంట్, పూర్వవిద్యార్థుల సంఘం సమావేశ మందిరం, బబిఎం స్మార్ట్ బ్లిస్టూమ్లలో సెషన్స్ జరుగుతాయి. సాయంత్రం సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 150 మందికిపైగా ఉపకులపతులు ఈ సదస్సుకు పాల్గొంటారు. రెండు రోజుల పాటు వీరికి ఏయూ ఆతిధ్యం ఇస్తుంది. రెండు రోజులు సదస్సులో భాగంగా వీరు ' రీసెర్చ్ అండ్ ఎక్స్లెన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ హయ్యర్ ఎడ్యుకేషన్' అంశంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. విభిన్న రంగాలకు చెందిన 20 మంది వరకు నిపుణులు, వక్తలు సదస్సులో పాల్గొంటారు. సదస్సులో ఏఐయూ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొంటారు.


కార్యక్రమ నిర్వహణపై వివిధ కమిటీలతో వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి సుదీర్ఘంగా చర్చించి, దిశా నిర్దేశం చేసారు. ప్రతిష్టాత్మక కార్యక్రమనికి ఏయూ అతిధ్యం ఇస్తున్న నేపథ్యంలో ఏయూ ప్రతిష్టను జాతీయ స్థాయిలో ఇనుమడింపచేసే విధంగా కృషి జరగాలని సూచించారు. కార్యక్రమ వివరాలు, వేదికలు వంటివి సులభంగా తెలుసుకునే విధంగా క్యూఆర్ కోడ్ విధానంలో తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె. సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి. కృష్ణమోహన్, సదస్సు నిర్వహణ సమన్వయకర్తలు ఆచార్య కె. రాంజీ, ఆచార్య బి. మోహన వెంకట రామ్, వివిధ కమిటీల చైర్మన్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa