అన్ని వర్గాల ప్రజలకు మంచి చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు. ఆత్మకూరు మండలం సిద్దపల్లి, డెయిరీ కాంప్లెక్స్ గ్రామాల్లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. విశాల దృక్పథంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. సుస్థిరాభివృద్ధే ధ్యేయంగా,జీవన ప్రమాణాల ఉన్నతే లక్ష్యంగా చేసుకుని తాము పాలన సాగిస్తున్నా మని అన్నారు. నవరత్నాలతో ఈ ప్రభుత్వం పేదలకు, ఇతర బడుగు బలహీన వర్గాలకు చేరువైందన్నారు. 8వ తరగతి విద్యార్థులకు టాబ్స్ ఇచ్చారు అంటే వాళ్లేమయినా వచ్చే ఎలక్షన్ నాటికి ఓటు వేస్తారని ఇచ్చారా ? అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa