అక్రమ భూ హక్కు పత్రాలను రద్దు చేయాలని, తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని మంగళవారం ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ ఆఫీసు ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, పెద్దకడబూరు మండల కార్యదర్శి వీరేష్,
ఆదోని పట్టణ కార్యదర్శి సుదర్శన్ మాట్లాడుతూ కల్లుకుంటలో ప్రభుత్వ భూములు సర్వే నంబర్లు174/1 , 173/3 177/1, 177/3 , 177/3, 177/3ఏ సదరు భూములు మరియు కల్లుకుంట గ్రామానికి చెందిన మూత బారిన రైతు కురువ లక్ష్మన్న మరియు ఇతని కుటుంబ సభ్యులు రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల ద్వారా పొందడం జరిగిందని గుర్తు చేశారు. సదర్ కేసు విచారణలో భాగంగా పెండింగ్ లో ఉందన్నారు. పెద్దకడబూరు తహసిల్దార్ తగాదా ఉన్న భూములను భూ సర్వే చేయకుండా సర్వే చేసినట్లు నిర్ధారించి పట్టపాస్తు పుస్తకాలు మంజూరు చేసినారని ఆరోపించారు. కావున అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన కురువ లక్ష్మన్న కుటుంబ సభ్యులపై చర్య తీసుకోవాలని, అదేవిధంగా ప్రస్తుత సాగు చేస్తున్న బీద రైతులకు ఆన్లైన్ నమో చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సభ్యులు రాజు, ఏఐకేఎస్ తాలుకా కార్యదర్శి అంజనేయ, ఏఐటీయూసీ నాయకులు రాజు, అంజన్నయ్య, తిక్కన్న, సర్దాస్ పటేల్, గోపాల్, నర్సింహ, లు సీనియర్ నాయకులు ఇస్మాయిల్, రామాంజి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa