జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పగటి వేషగాడని మంత్రి సిదిరి అప్పలరాజు విమర్శించారు. గ్రామాల్లో పండగల సమయంలో పగటి వేషగాళ్లు వస్తారని.. ఇప్పుడు పవన్ కూడా అలాగే వచ్చాడని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనంపై 2019 తర్వాత అని పవన్ మాట్లాడుతున్నాడని.. 2014 నుంచి 2019 వరకు పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పవన్ యజమాని చంద్రబాబు అని.. 2014 నుంచి 19 వరకు మాట్లాడొద్దు అని చెప్పాడా అని ప్రశ్నించారు. మాట్లాడితే చంద్రబాబు ప్యాకేజీ తగ్గిస్తా అన్నాడా పవన్ అని సూటి ప్రశ్న వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa