ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందేభారత్ ఎక్స్ ప్రెస్... చూసేందుకు జనం ఎగబడ్డారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 15, 2023, 08:55 PM

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును చూసేందుకు విజయవాడలో జనం ఎగబడ్డారు. ఇదిలావుంటే దేశంలోనే అత్యంత వేగంతో ప్రయాణించే రైలుగా పేరుగాంచిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఇకపై తెలుగు రాష్ట్రాల మధ్య కూడా నడవనుంది. ఇవాళ సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కాగా ఈ రైలు వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ చేరుకుంది. 


ఈ రైలు రాకతో విజయవాడ స్టేషన్ లో కోలాహలం నెలకొంది. ఈ అత్యాధునిక ట్రైన్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ ఫోన్లలో వందేభారత్ రైలు రాకను చిత్రీకరించారు. ఈ రైలు సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకోనుంది. తెలంగాణలో వరంగల్ ఖమ్మం... ఏపీలో విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa