కొత్త సంవత్సరంలో భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కార్ల దరలను పెంచడమే కాదు వాటిని అమలులోకి తీసుకొచ్చేసింది. తమ కార్ల రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రతి కారుపై సగటున 1.1 శాతం పెంచుతున్నట్లు మారుతి సుజుకీ సోమవారం తెలిపింది. అన్ని మోడళ్ల కార్లకు ఇది వర్తిస్తుందని చెప్పింది. ధరల పెంపు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన వ్యయం కారణంగా జనవరి నెలలో కార్ల ధరలను పెంచాల్సి ఉంటుందని మారుతి సుజుకీ గత నెలలో తెలిపింది.
ఈ క్రమంలో సోమవారం నుంచి అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచింది. ప్రస్తుతం భారత మార్కెట్ లో బడ్జెట్ కార్ల వినియోగంలో మారుతి ముందంజలో ఉంది. మధ్య స్థాయి ప్రీమియం కార్ల శ్రేణిలోనూ ఇతర సంస్థలకు మారుతి గట్టి పోటీనిస్తోంది. మారుతి కార్ల ధరలు పెరుగుదల మార్కెట్ పై ప్రభావం చూపనుంది. మారుతి బాటలో ఇతర కంపెనీలు కూడా ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa