ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా జోషిమఠ్ లో ఇప్పటివరకూ 863 భవనాల్లో పగుళ్లు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. ఇందులో 181 భవనాలు అన్ సేఫ్ జోన్ లో ఉన్నాయని తెలిపారు. శనివారం వాతావరణం అనుకూలించడంతో భవనాల కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. బాధిత ప్రజల నుంచి సలహాలు తీసుకున్న తర్వాత, ప్రజల తరలింపుపై ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa