ప్రజలు సమస్యల కోసమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే యు. వి రమణ మూర్తిరాజు (కన్నబాబు) అన్నారు. జగన్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. అచ్యుతాపురం మండలం భోగాపురం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే, డీసీసీబీ మాజీచైర్మన్ సుకుమార వర్మతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథ కాలు ప్రజలకు వివరించారు. అర్హత కలిగిన లబ్ధిదారులు ఉంటే వెంటనే సంక్షేమ పథ కాలు అందే విధంగా పరిష్కరించాలని సచివాలయం సిబ్బందికి అధికారులకు ఆదేశించారు. జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు వ్యవస్థ దేశా నికే ఆదర్శమ న్నారు. వాలంటీర్లు పనితీరును ఆయన అభినందించారు. సుకుమార్ వర్మ సొంత నిధులతో వాలంటీర్లుకు బ్యాగులను పంపిణీ చేశారు. జెడ్పీ టీసీ లాలం రాంబాబు, జెడ్పీటీసీ కో ఆప్షన్ సభ్యులు కుమార్, చేపల శ్రీరా ములు, వైసీపీ నాయకులు కోస బుజ్జి, దేశంశెట్టి శంకరరావు, విమలనాయుడు పిన్నంరాజు వాసు, డిఎస్ఎన్ రాజు, గొర్రె నూకరాజు, తోట వెంకటేష్, మోటూరు సంజీవి, పంచదార్ల పైడిరాజు, కొమ్మోజి, ఈశ్వరరావు, ఉమ్మడి జగన్, సియ్యద్రి. బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa