2024లో జరిగే ఎన్నికలకు అవనిగడ్డ నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని చల్లపల్లి జడ్పిటిసి సభ్యులు రాజుల పార్టీ కళ్యాణి, బీసీ నేత రాజులు పార్టీ శివప్రసాద్ లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి విన్నవించారు. మంగళగిరి మండలం తాడేపల్లి వైఎస్ఆర్సిపి సెంటర్ పార్టీ కార్యాలయంలో వారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో పలు సమస్యల గురించి, రోడ్లు, డ్రైనేజీ, ఇతర ఇతర సమస్యల గురించి ఆయనకు తెలిపారు. 2024 రాబోయే ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గాన్ని బిసిలకు కేటాయించాలని, నియోజకవర్గంలో లక్షకు పైన బిసిలు ఉన్నారని ఆయనకు తెలియజేశారు.సానుకూలంగా స్పందించిన ఆయన ఈ విషయాన్ని పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంచుతానని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa