నందమూరి తారకరత్నకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లుగా వైద్యులు వెల్లడించారు. బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ప్రకటించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. తారకరత్నకు ఎలాంటి ఎక్మో పెట్టలేదని.. ఎక్మో పెట్టారనేది ప్రచారం మాత్రమే అని కొట్టి పారేశారు. తారకరత్న పరిస్థితి విషమంగానే ఉందన్న వైద్యుల ప్రకటనతో.. అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది.
తారకరత్న బంధువు నందమూరి రామకృష్ణ బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు. తారకరత్నకు ఎక్మో ఏమీ పెట్టలేదని.. అదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేశారు. తారకరత్న శరీర అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయని రామకృష్ణ వెల్లడించారు. న్యూరో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. త్వరలోనే తారకరత్న మామూలు మనిషిగా బయటికి వస్తారని నందమూరి రామకృష్ణ వివరించారు. అయితే.. వైద్యుల ప్రకటనకు.. బంధువుల ప్రకటనలతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద అభిమానులు, సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. దీంతో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసు అధికారులను బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ప్రతాప్రెడ్డి ఆదేశించారు. తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని నందమూరి బాలకృష్ణ ఆదివారం చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని.. ఆరోగ్య పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంది అన్నారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని.. రెండుసార్లు తారకరత్న శరీరంపై గిచ్చితే.. ఓసారి స్పందించారని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa