గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్కు సొంత నియోజకవర్గంలో వెళ్లడానికి సిద్దమైన తరుణంలో స్థానికులు ఆయనకు ఝమా గ్రామానికిరావొద్దంటూ చెపుల దండ కట్టిన వ్యక్తి... భీమిలిలో మాజీ మంత్రి అవంతికి చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశాఖ జిల్లా భీమిలి మండలం కె.నగరపాలెం వెళ్లారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి రాకుండా ఆ గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు తొత్తడి సూరిబాబు, మరికొందరు స్థానికులు కలిసి రోడ్డుకు అడ్డంగా పాత చెప్పుల దండ కట్టారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు వెళ్లి దాన్ని తొలగించారు. సూరిబాబును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు.. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి.
ఆ తర్వాత గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తుండగా తన మొబైల్లో చిత్రీకరిస్తున్న రాజేంద్రను స్థానిక వైఎస్సార్సీపీ కార్పొరేటర్, నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడం పరిస్థితి సద్దుమణిగింది. తర్వాత మాజీ మంత్రి అవంతి తన కార్యక్రమాన్ని కొనసాగించారు.
టీడీపీకి చెందిన కొందరు దురుద్దేశంతోనే ఇలా చేశారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇక్కడ ఇళ్ల స్థలాల అంశం కోర్టు పరిధిలో ఉందని.. వాళ్లు కావాలనే రాద్ధాంతం చేసినా తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు. చెప్పులు కట్టిన వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తుంటే తానే వద్దని చెప్పానన్నారు. తాను ఎవరి జోలికీ వెళ్లనని.. తన జోలికి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అన్నారు. ఈ విషయంలో తగ్గేది లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa