ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మాజీ మంత్రి, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మారడంతో ఈ కేసు విచారణ ఊపందుకొంది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను సీబీఐ విచారిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా.. గతంలో కృష్ణ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో వీరిద్దరు కడప కేంద్ర కారాగారంలో సీబీఐ విచారణకు హాజరయ్యారు.
గతనెల 28న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన సీబీఐ.. ప్రధానంగా ఆయన కాల్డేటాపై ఆరా తీసింది. నవీన్ అనే వ్యక్తి పేరిట ఉన్న మొబైల్ నంబర్కు అవినాష్ ఎక్కువగా కాల్ చేసి మాట్లాడినట్లు సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. దీంతో అతనితో పాటు కృష్ణ మోహన్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. వివేకానందరెడ్డి కేసులో నిందితులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి, రిమాండ్ ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఉమాశంకర్రెడ్డి, సునీల్ యాదవ్లను ఫిబ్రవరి 10న విచారణకు హైదరాబాద్కు రావాలని సీబీఐ నోటీసులిచ్చింది. అయితే.. సీఎం ఓఎస్డీ, ముఖ్యమంత్రి ఇంట్లో పనిచేసే వ్యక్తిని విచారణకు పిలవడం చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa