యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి పతివ్రత అవతారం ఎత్తారని.. తాను పతివ్రతని అని చెప్పుకుంటూ, తన తమ్ముడు కృష్ణుడు ఎదవన్నర ఎదవ అని చెప్పుకుంటున్నారంటూ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తుని నియోజకవర్గంలో గత 40 ఏళ్లగా యనమల రామకృష్ణుడు డైరెక్షన్లో కృష్ణుడు ప్రజలను పీడించుకుతిన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై ఏ కేసు పెట్టాలని కృష్ణుడు అడిగితే.. అట్రాసిటీ కేసు పెట్టమని యనమల రామకృష్ణుడు చెప్పారని దాడిశెట్టి రాజా అన్నారు. తునిలో ఎంతో మంది విలువైన ప్రాణాలను తీసేసి, వారి ఆస్తుల్ని కృష్ణుడు కాజేశాడని ఆరోపించారు. యనమల రామకృష్ణుడుకు దమ్ముంటే.. తమ్ముడి ద్వారా తుని ప్రజల నుంచి దోచేసిన సొమ్ములను తిరిగిచ్చేసి, అప్పుడు పతివ్రతను అని చెప్పుకోవాలని సవాల్ విసిరారు.
ఇక, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై పరోక్షంగా కౌంటర్లు వేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెర లేపారని, తప్పులన్నీ వాళ్లు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పార్టీ విడిచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు, వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరని తాను ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. గతంలో జగన్ను కష్టాల్లో వదిలి 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని, ఇప్పుడు.. వారి రాజకీయ భవిష్యత్ ఏంటో అందరూ చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa