ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 05, 2023, 02:42 PM

రాష్ట్రంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపితే అలాంటివారిపై పోలీసు కేసులు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ కేసలి అప్పారావు జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని, అందుకు బాల్య వివాహాలు ప్రధాన కారణమని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి బాల్య వివాహాల నిరోధక అధికారులందరూ ఈ చట్టాన్ని కఠినతరంగా అమలు చేయడం కోసం అన్ని శాఖల సమన్వయంతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో చర్యలు తీసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa