మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ 27 వ డివిజన్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య. పార్టీ నేతలు సోమవారం రాత్రి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వ, పోలీస్ వైఫల్యం వల్ల జరిగిన దుర్ఘటనను జగన్ రెడ్డి సిగ్గులేకుండా రాజకీయం చేస్తున్నారు. వైసీపీ పాలనలో గ్రామాలు మురుగునీటి కూపాలుగా మారాయి. గ్రామాలలో అపరిశుభ్రత నెలకొన్నా పాలకులకు పట్టడం లేదు. నిరుద్యోగులు తల్లితండ్రులపై ఆధారపడకుండా, వారి కనీస ఖర్చులకు ఉపయోగపడేలా నెలకు 3వేలు నిరుద్యోగ భృతి చంద్రబాబు ఇస్తే, దానిని కూడా జగన్రెడ్డి రద్దు చేయడం దుర్మార్గం
నాణ్యమైన బియ్యం ఇస్తామని మోసంచేసి దుడ్డు బియ్యం ఇస్తున్నారు. గ్రామంలో 26 పింఛన్లు పీకేసారుని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa