తారకరత్న మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. తారకరత్న కుటుంబ సభ్యులకు, నందమూరి అభిమానులకు ఈ విషాదాన్ని దిగమింగుకునే శక్తినివ్వాలని ప్రార్థించారు. మరోవైపు ఎంపీ విజయసాయి రెడ్డి కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తారకరత్న ఎప్పటిలా ఆరోగ్యంగా తిరిగిరావాలని అందరం కోరుకున్నామని.. కానీ విధి మరోలా తలచిందన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa