పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తారకరత్న మృతి చెందారని, పాదయాత్ర రోజు ట్రాఫిక్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. గుండెపోటు వచ్చిన తర్వాత హాస్పిటల్కు తీసుకువెళ్లడానికి 45 నిమిషాలు పట్టిందని, పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన లోకేష్ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. లోకేష్, బాలకృష్ణ, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నడుస్తుండగా.. ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. కేసీ హాస్పిటల్ వైద్యులు ఆయనకు సీపీఆర్ చేశారు. కుడి, ఎడమ రక్తనాళాల్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. గుండెనొప్పి వచ్చిన ఐదు నిమిషాలకే ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ హాస్పిటల్కు తారకరత్నను తరలించారు.
గుండెనొప్పి వచ్చిన తర్వాత 45 నిమిషాల పాటు తారకరత్న స్పృహలో లేరు. వైద్యుల సూచన మేరకు జనవరి 27న అర్థరాత్రి కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు గ్రీన్ ఛానెల్ ద్వారా అంబులెన్స్లో కుటుంబసభ్యులు తరలించారు. జనవరి 28న తెల్లవారుజామున 2 గంటల నుంచి హృదయాలయలో వైద్యులు చికిత్స ప్రారంభించారు. జనవరి 28న వైద్యులు యాంజియయోప్లాస్టీ నిర్వహించారు.
తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని నందమూరి బాలకృష్ణ జనవరి 29న ప్రకటించారు. జనవరి 30న బ్రెయిన్, ఎంఆర్ఐ స్కాన్, హార్ట్ టెస్టులు చేసిన వైద్యులు.. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. తక్కువ ఆక్సీజన్ అందడంతో బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందని డాక్టర్లు తెలిపారు. జనవరి 31న హాస్పిటల్ బెడ్పై నీట్ షేవ్తో తారకరత్న కనిపించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 1న 10 మంది వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించింది.
ఫిబ్రవరి 2న తారకరత్నను కోమా నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఫిబ్రవరి 16న తారకరత్నకు మరోసారి బ్రెయిన్ స్కాన్ చేయగా.. ఆ రోజు నుంచి విదేశీ వైద్య నిపుణులతో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తరలించాలని కుటుంబసభ్యులు భావించారు. అయితే ఫిబ్రవరి 18న రాత్రి తారకరత్న చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. తారకరత్న మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. నందమూరి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తారకరత్న మృతి కారణంగా నారాా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa