సీనియర్ సిపిఎం నాయకులు, తెలుగురావుపాలెం మాజీ సర్పంచ్ జటావత్తు రెడ్డి 23వ వర్ధంతి తెలుగురావుపాలెంలోని ఆయన స్మారక స్తూపం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిడుమోలు మాజీ శాసనసభ్యులు పాటూరి రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని జటావత్తు రెడ్డి స్మారక స్తూపం వద్ద చిత్రపటానికి పూలమాల వేసి అరుణ పతాకం ఎగురవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాటూరి రామయ్య మాట్లాడుతూ జటావత్తు రెడ్డి తాను నిడుమోలు శాసనసభ్యులు కాకముందు నుంచి పరిచయస్తులని సిపిఎం పార్టీ కి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఆయన చనిపోయి 23 సంవత్సరాలైనా అతని కుమారులు ఇప్పటికీ ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారులు జటావత్తు బాలాజీ, జటావత్తు హాతి రాముడు, సిపిఎం సీనియర్ నాయకుడు వాకా రామచంద్రరావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మేడంకి వెంకటేశ్వరరావు, తెలుగురావుపాలెం సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు, శ్రీకాకుళం ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్న), ఎన్. బిక్షం రాజు, జి. గిరిరాజు, జి. సీతారామయ్య, ఎం. విక్రమ్ రావు, ఆర్. సాంబశివరావు, జె. శివశంకరరావు, జి. గురు ప్రసాద్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa